Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆయన వ్యాఖ్యలకు అప్పట్లోనే నాగబాబు కౌంటర్ ఇచ్చారు. తరువాత చాలా రోజులకు కోట ఇప్పుడు మళ్లీ ఏకంగా చిరంజీవిపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు. ఇంతకీ కోట ఏమన్నారంటే..
మేడే ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి పలు కీలకవ్యాఖ్యలు చేశారు. వాటిపైనే కోట స్పందించారు. చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నానని చిరంజీవి అన్నారు. అయితే దీనిపై కోట విమర్శలు చేశారు. ప్రస్తుతం ఎంతో మంది అవకాశాలు లేక కృష్ణానగర్లో ఉంటున్నారని.. చాలా మంది అవకాశాలు లేక వ్యసనాల బారిన పడుతున్నారని.. వారికి అవకాశాలు ఉంటే.. సినిమాల్లో నటిస్తూ డబ్బులు సంపాదిస్తారని.. అలాంటప్పుడు వారు అపోలో హాస్పిటల్కు వెళ్లాలని చూస్తారు కానీ.. కార్మికుల హాస్పిటల్కు ఎందుకు వెళ్తారని.. కోట ప్రశ్నించారు. కార్మికులకు కావల్సింది హాస్పిటల్ కాదని.. తిండి.. అవకాశాలు అని అన్నారు.
చిరంజీవి మేడే ఉత్సవాల్లో భాగంగా తాను కార్మికుడినని అన్నారని.. అయితే రూ.కోట్లల్లో పారితోషికం తీసుకునేవారు కార్మికుడు ఎలా అవుతాడని అన్నారు. అలాగే ఆయన సినిమాల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చి ఆదుకున్నారా.. అని అడిగారు. ఇక చిరంజీవి తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పుకుంటారని.. అయితే ఏనాడైనా తన వద్దకు వచ్చే వారికి ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా.. అని ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చే చిన్న కార్మికులకు సైతం రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తుంటానని.. ఇక అవసరం ఉన్నవారికి రూ.5 లక్షల వరకు కూడా తాను సహాయం చేశానని కోట అన్నారు. అలాగే తాను షుగర్ పేషెంట్ అయి ఉండి కూడా సినీ కార్మికుల కోసం గతంలో 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు.
కాగా కోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక చిరంజీవి ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య మూవీ విడుదల అనంతరం ఆయన భార్య సురేఖతో కలిసి టూర్కు వెళ్లారు. ఇంకో నెల రోజుల వరకు ఆయన అక్కడే ఉండనున్నారు.
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…