Kiwi Fruit : ప్రతి మనిషికి తగినంత నిద్ర పొందడం చాలా అవసరం. నిద్ర మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక రాత్రి నిద్ర లేకపోవడం మరుసటి రోజు మీ ప్రణాళికలపై దృష్టి లేకుండా చేస్తుంది. కాలక్రమేణా నిద్ర తగ్గిపోవడం మీ ఉదయం మూడ్ కంటే ఎక్కువ గందరగోళానికి గురి చేస్తుంది. రోజూ నాణ్యమైన నిద్రను పొందడం వల్ల మీ బ్లడ్ షుగర్ నుండి మీ వ్యాయామాల వరకు అన్ని రకాల సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒక మనిషి కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి వల్ల ప్రస్తుతం చాలామంది హాయిగా నిద్రపోలేకపోతున్నారు. నిద్ర సమయంలో అవకతవకల వల్ల ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కివీ ఫ్రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతి రోజూ ఒక కివీ ఫ్రూట్ తినడం వలన నిద్ర ప్రారంభమైన తర్వాత మేల్కొనే సమయం తగ్గిస్తుంది. నిద్ర సమయం మరియు నిద్ర సామర్థ్యం గణనీయంగా పెంచుతుంది. కివీ ఫ్రూట్ తినటం వలన నిద్ర భంగం ఉన్న పెద్దలలో నిద్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారికి కివీ మంచి ఔషధం. కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్ర పోవటానికి గంట ముందు ఒక కివీ పండును తింటే హాయిగా నిద్రపడుతుంది.
కివీలో నిమ్మ, నారింజ కంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. అందువలన కివీ తినడం వల్ల చర్మానికి కావలసిన విటమిన్ సి అంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా గర్భిణీలు కివీ పండ్లను తినటం వలన బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. రోజుకు రెండు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను తగ్గిస్తాయి. కివీ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన మానసిక వ్యాధులను కూడా దరిచేరనివ్వదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…