Khushboo : ఒకప్పుడు తన అందచందాలతో అదరగొడుతూ ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేసిన అందాల తార ఖుష్బూ. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతోంది. నాలుగేళ్ల క్రితం వరకూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ వచ్చారు ఖుష్బూ. అది కూడా ఎక్కువగా గెస్ట్ రోల్స్ మాత్రమే చేశారు. అయితే ఇప్పుడు కెరీర్ని సీరియస్గా తీసుకున్నట్లున్నారు. ఇటీవల అన్నాత్తేలో నటించారు. తాజాగా విడుదలైన ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో ఓ కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు గోపీచంద్ సినిమా చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
తాజాగా మీరా అనే కొత్త సీరియల్తో బుల్లితెరపైకి వచ్చారు. ఈ సీరియల్కు సంబంధించిన వివరాలను ఖుష్బూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. మహిళలు ఎలాంటి వేధింపులకి గురికాకూడదని నేను నొక్కి చెబుతుంటాను. దాన్ని మరోసారి మీరాతో చెప్పాలని అనుకుంటున్నాను. విలువలతో కూడిన బలమైన వ్యక్తి మీరా. స్వయం కృషితో జీవితంలో పైకి రావడంతోపాటు ఆత్మగౌరవం మెండుగా ఉన్న వైద్యురాలు. వేధింపులకి గురైన మహిళగా అనేక సమస్యలు భరిస్తూ కుటుంబం కన్నా ఏదీ ఎక్కువ కాదు అనేలా ఉంటుంది మీరా.
స్త్రీలను వేధించడం నేను ప్రత్యక్షంగా చూశాను. నా తల్లి కూడా హింస, శారీరక వేధింపులకి గురి కావడం చూశాను. ఆమె మౌనంగా ఉండిపోయింది. అందుకు కారణం ఆమె అది వైవాహిక జీవితంలో భాగమని భావించడం. ఆత్మగౌరవం, గౌరవం విషయంలో రాజీపడాల్సి వచ్చేది. ఈ సీరియల్లో ఒక్క చెంపదెబ్బ కొట్టిన భర్త నుండి దూరంగా వెళ్లిన మీరా ఆమె ఎలాంటి వ్యక్తి అనేది చెబుతుంది. చాలా చోట్ల స్త్రీలు గుర్తించబడకపోవడానికి పురుషులే కారణం. ఇంట్లో సమస్యలు ఎదురవుతున్నా చాలా మంది మహిళలు బయట మాట్లాడరు. అయితే సంకోచం, భయం లేకుండా ధైర్యంగా మాట్లాడటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఖుష్బూ పేర్కొన్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…