Kalyan Dhev : మెగా స్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తలలో వినిపిస్తోంది. శ్రీజ, కల్యాణ్దేవ్లు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని.. వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇప్పటికీ ఈ విషయంపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటోంది. కల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి అందుకనే దూరంగా ఉంటున్నాడని కూడా అంటున్నారు.
ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ మొత్తం పలు సందర్భాల్లో కలసి వేడుకలు జరుపుకున్నారు. కానీ వాటిల్లో ఎక్కడా కల్యాణ్ దేవ్ కనిపించలేదు. దీంతో కల్యాణ్దేవ్, శ్రీజ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ మధ్యే శ్రీజ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ముంబై వీధుల్లో తన అన్న రామ్ చరణ్తో తిరిగిన ఆమె.. అలాంటి చిన్న చిన్న సంతోషమైన క్షణాల కోసమే తాను ఇంకా బతికి ఉన్నానని కామెంట్ చేసింది. దీంతో ఆమె బాధలో ఉండి ఎమోషనల్గా ఆ పోస్టు పెట్టి ఉంటుందని అనుకున్నారు.
ఇక కల్యాణ్ దేవ్ కూడా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. సముద్రపు అలలతో కూడిన ఫొటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్.. చాలా సంతోషంగా.. హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. అయితే అందులో అర్థం ఏమై ఉంటుందా.. అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. శ్రీజకు అతను విడాకులు ఇచ్చాడని.. అందుకనే అతను సంతోషంగా ఉన్నాడని కొందరు అంటున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో శ్రీజ ఎక్కడ తిరిగినా.. ఒంటరిగానే కనిపిస్తుంది కానీ పక్కనే కల్యాణ్ దేవ్ ఉండడం లేదు. ఇక అతని సినిమాలను కూడా మెగా ఫ్యామిలీ ఎక్కడా ప్రమోట్ చేయడం లేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…