Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సందడి చేసే జాన్వీకపూర్ మొట్టమొదటిసారిగా సాంప్రదాయబద్ధంగా పట్టు చీర కట్టుకొని కుందనపు బొమ్మలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జాన్వీ కపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని ఏకంగా ఈ ముద్దుగుమ్మతో కేక్ కట్ చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా జాన్వీకపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకల కోసం తిరుపతికి వచ్చింది.
ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈమె స్వామివారిని దర్శించుకుంది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా పట్టు చీర కట్టుకొని బాపుబొమ్మలా ఉన్న జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ॐ శ్రీ వేంకటేశ్వరాయే నమో నమః శ్రీమన్ నారాయణ నమో నమః తిరుమల తిరుపతి నమో నమః’ అంటూ క్యాప్షన్ పెడుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…