Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సందడి చేసే జాన్వీకపూర్ మొట్టమొదటిసారిగా సాంప్రదాయబద్ధంగా పట్టు చీర కట్టుకొని కుందనపు బొమ్మలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
జాన్వీ కపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని ఏకంగా ఈ ముద్దుగుమ్మతో కేక్ కట్ చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా జాన్వీకపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకల కోసం తిరుపతికి వచ్చింది.
ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈమె స్వామివారిని దర్శించుకుంది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా పట్టు చీర కట్టుకొని బాపుబొమ్మలా ఉన్న జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ॐ శ్రీ వేంకటేశ్వరాయే నమో నమః శ్రీమన్ నారాయణ నమో నమః తిరుమల తిరుపతి నమో నమః’ అంటూ క్యాప్షన్ పెడుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…