సాధారణంగా ఏదైనా తప్పుడు పనులు లేదా దొంగతనాలు చేస్తే మనుషులపై ఫిర్యాదు చేయడం గురించి మనం విన్నాం. కానీ కాకుల పై ఫిర్యాదు చేయడం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా రెండు కాకుల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ రెండు కాకులు ఏం చేశాయో తెలుసా..
యూకేలోని కార్లిస్లే అవెన్యూ, లిటిల్ఓవర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా కార్ల విండ్స్క్రీన్, వైపర్లు పాడవుతున్నాయి. ఎవరో కార్ల మీద గీతలు పెడుతున్నారు.కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉండే కొన్ని విలువైన వస్తువులను దొంగలించి వెళ్తున్నారు. ఈ విధంగా ఎవరో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన స్థానికులు వారిని కనుగొనడం కోసం స్థానికంగా ఉండే యువకులను కాపలాగా పెట్టారు. అయితే కాపలాగా ఉన్న ఆ యువకులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది.
గత కొన్ని రోజుల నుంచి వారి కార్లపై బీభత్సం సృష్టిస్తున్నది మనుషులు కాదు, కాకుల అని తెలియడంతో వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అది కూడా రెండు కాకులు మాత్రమే ఈ విధంగా కారు అద్దాలు పగలగొట్టడం, కారులో ఉన్న వస్తువులు దొంగలించడం వంటి పనులు చేస్తున్నాయని తెలియడంతో వారు ఆ కాకులను తరమడానికి ప్రయత్నించారు. అయితే అవి వెళ్ళినట్టే వెళ్లి తిరిగి అదే పని చేయడంతో ఎంతో విసిగిపోయిన ఆ ప్రాంత వాసులు ఆ రెండు కాకుల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈవిధంగా కాకుల పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కాకులు తమ పనిని కొనసాగిస్తూ ఉండడంతో ఆ ప్రాంతవాసులు ఆ రెండు కాకులకు ఆహారం పెడుతూ వాటిని మచ్చిక చేసుకుంటున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…