పురావస్తు శాఖ తవ్వకాల్లో అప్పుడప్పుడు విలువైన సంపద బయట పడుతుంటుంది. పూర్వ కాలానికి చెందిన రాజులు లేదా ప్రముఖ వ్యక్తులు దాచి పెట్టిన సంపదతోపాటు విలువైన వస్తువులు ఆ తవ్వకాల్లో బయట పడుతుంటాయి. అయితే కొన్ని చోట్ల యాదృచ్ఛికంగానే ఇతర పనులకు తవ్వకాలు చేపడితే సంపద బయట పడుతుంది. కానీ ఇలా దాదాపుగా అరుదుగానే జరుగుతుందని చెప్పవచ్చు.
అయితే అక్కడ కూడా ఈ విధంగానే వేరే పనికోసం తవ్వకాలను చేపట్టారు. దీంతో ఓ సొరంగం బయటపడింది. ఆ విషయం తెలిసిన స్థానికులు అంతులేని సంపద ఉందేమోనని భావించి అక్కడ భారీ ఎత్తున పోగయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్లోని బీర్భమ్ జిల్లాలో ఉన్న రాజ్నగర్ అనే ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే అనూహ్యంగా ఓ సొరంగం బయటపడింది. దీంతో ఆ సొరంగం గుండా వెళితే సమీపంలో ఉన్న ప్యాలెస్కు చేరుకోవచ్చని, అందులో అంతులేని సంపద ఉందేమోనని భావించిన స్థానికులు ఆ మార్గంలో తవ్వడం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి అక్కడ ఉన్న జనాలు పారిపోయారు. ఇక అక్కడ పనులు ఏవీ చేపట్టకుండా ప్రస్తుతం నిలిపివేశారు. కానీ ఆ సొరంగంలో ఏదో ఉందని స్థానికులు అనుకుంటున్నారు.
అయితే అది సొరంగం కాదని, గతంలో ఎవరో భవన నిర్మాణం కోసం తవ్విన మార్గమని కొందరంటున్నారు. ఇక ఈ విషయమై వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడికి సమీపంలోని రాజ్బరి అనే ప్రాంతంలో ప్యాలెస్ ఉంది. అయితే ఈ సొరంగం అక్కడికి అనుసంధానం అవుతుందని, దాని గుండా వెళితే సంపద లభిస్తుందని.. ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పోలీసులు అక్కడ గస్తీ పెంచారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…