మా అమ్మ చావు బతుకుల్లో ఉంది, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా అయ్యేలా చూడండి.. అని ఓ వ్యక్తి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్కు గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆ మంత్రివర్యులు మాత్రం ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానని బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దామోలో ఉన్న జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ గురువారం సదరు హాస్పిటల్ను సందర్శించారు. అయితే ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి తన తల్లి కోవిడ్తో చికిత్స పొందుతుందని, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ సిలిండర్ 2 గంటలే వస్తుందని, కనుక ఆక్సిజన్ సిలిండర్ సరఫరా అయ్యేలా చూడాలని మంత్రిని కోరాడు. అయితే అందుకు ప్రహ్లాద్ పటేల్ అసహనం ఫీలయ్యారు. ఎక్కువ మాట్లాడితే రెండు చెంప దెబ్బలు కొడతానన్నారు. అయినా సరే తాను చెంప దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమని, కానీ ఆక్సిజన్ సిలిండర్ను మాత్రం ఇవ్వాలని, లేదంటే తన తల్లి చనిపోతుందని అతను ప్రాధేయపడ్డాడు.
కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్గా మారడంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. నెటిజన్లు కూడా ఆయన వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఓ వ్యక్తి సహాయం చేయమని వస్తే ఆయన అలా అనడం అత్యంత హేయమైన చర్య అని కామెంట్లు చేశారు. అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం ఆ వ్యక్తి పరుష పదజాలంతో మాట్లాడాడని, అందుకనే మంత్రి అలా అన్నారని, అందులో వేరే ఉద్దేశం లేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహాయం చేయమని అడిగిన వారిని అలా అనడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…