తన పొలంలో ఉన్నటువంటి బావిని ఎవరో దొంగిలించారని,ఎలాగైనా తన బావిని వెతికి పట్టుకొని తనకు అప్పజెప్పాలని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఫిర్యాదుకు పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బాబుని దొంగలించడం ఏంటి దానిని వెతికి పట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వివరాలలోకి వెళ్లాల్సిందే.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తనపొలంలో ఉన్న బావిని ఎవరో దొంగిలించారని ఎలాగైనా దానిని వెతికి పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసులు ఆరా తీయగా.. గ్రామ పంచాయతీ అధికారులు తన పొలంలో బావిని తవ్వినట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. అయితే ప్రస్తుతం భావి తవ్వకానికి తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో చెల్లించాలంటూ రైతుకి ప్రభుత్వం నుంచి నోటీసులు వస్తున్నాయి.
అయితే ఈ విధంగా నోటీసులు రావడంతో ఎంతో ఆశ్చర్యపోయిన రైతు అసలు విషయం తెలుసుకొని ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా బావి పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ విధంగా అధికారులు తన పొలంలో బావి తవ్వినట్లు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన విషయం బయట పెట్టాలనే ఉద్దేశంతో రైతు ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…