మహమ్మారి కరోనా ఎంతో మందిని తమ ఆత్మీయులకు దూరం చేసింది. చివరి చూపులకు కూడా నోచుకుండా చేస్తోంది. తమ ఆత్మీయులను కడసారి చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది మాయదారి కరోనా. ఈ క్రమంలోనే ఎన్నో లక్షల మంది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చనిపోయారు. అనేక చోట్ల శ్మశానాల్లో కుప్పలు తెప్పలుగా కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారు. కాగా కరోనా బారిన పడ్డ ఓ డాక్టర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
ముంబైకి చెందిన సెవ్రి టీబీ హాస్పిటల్ డాక్టర్ మనీషా జాదవ్కు కరోనా సోకింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే ఓ రోజు ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. ఇదే నాకు చివరి గుడ్ మార్నింగ్. ఇదే చివరి పోస్టు. ఇకపై ఈ ప్లాట్ఫాంలో మిమ్మల్ని కలుసుకోలేను. అందరూ జాగ్రత్తగా ఉండండి. శరీరం చనిపోతుంది. ఆత్మ కాదు. ఆత్మకు మరణం లేదు. అంటూ ఆమె ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. ఈ క్రమంలో ఆమె పోస్టు పెట్టిన మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె పోస్టు వైరల్గా మారింది.
ఆ డాక్టర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు అందరినీ విచారానికి గురి చేస్తోంది. అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. దిక్కుమాలిన కరోనా ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో కదా అంటూ అందరూ కరోనాను తిట్టిపోస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ 18వేల మంది డాక్టర్లకు కోవిడ్ సోకగా వారిలో 168 మంది చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేసింది.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…