మహమ్మారి కరోనా ఎంతో మందిని తమ ఆత్మీయులకు దూరం చేసింది. చివరి చూపులకు కూడా నోచుకుండా చేస్తోంది. తమ ఆత్మీయులను కడసారి చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది మాయదారి కరోనా. ఈ క్రమంలోనే ఎన్నో లక్షల మంది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చనిపోయారు. అనేక చోట్ల శ్మశానాల్లో కుప్పలు తెప్పలుగా కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారు. కాగా కరోనా బారిన పడ్డ ఓ డాక్టర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
ముంబైకి చెందిన సెవ్రి టీబీ హాస్పిటల్ డాక్టర్ మనీషా జాదవ్కు కరోనా సోకింది. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే ఓ రోజు ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. ఇదే నాకు చివరి గుడ్ మార్నింగ్. ఇదే చివరి పోస్టు. ఇకపై ఈ ప్లాట్ఫాంలో మిమ్మల్ని కలుసుకోలేను. అందరూ జాగ్రత్తగా ఉండండి. శరీరం చనిపోతుంది. ఆత్మ కాదు. ఆత్మకు మరణం లేదు. అంటూ ఆమె ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. ఈ క్రమంలో ఆమె పోస్టు పెట్టిన మరుసటి రోజు మృతి చెందింది. దీంతో ఆమె పోస్టు వైరల్గా మారింది.
ఆ డాక్టర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు అందరినీ విచారానికి గురి చేస్తోంది. అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. దిక్కుమాలిన కరోనా ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో కదా అంటూ అందరూ కరోనాను తిట్టిపోస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ 18వేల మంది డాక్టర్లకు కోవిడ్ సోకగా వారిలో 168 మంది చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేసింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…