Nithiin : తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నితిన్ ఫస్ట్ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నా.. ఇష్క్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో నితిన్ క్రేజీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా భీష్మ, రంగ్ దే, మాస్ట్రో సినిమాలతో హిట్ సాధించి వరుస సినిమాలపై ఫోకస్ చేశాడు. అలాంటి నితిన్ పర్సనల్ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
నితిన్ అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు హీరో నితిన్. ఆయనకు నిఖితారెడ్డి సోదరి ఉంది. హైదరాబాద్ రత్న కాలేజ్ లో ఇంటర్మీడియట్, గండిపేటలో షాదాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతోపాటు చినదాన నీకోసం సినిమాల్ని రూపొందించారు. నితిన్.. శాలినీని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన భీష్మ సూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఈ సమయంలో ఆ మూవీ డైరెక్టర్ కి రేంజ్ రోవర్ కారుని నితిన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ రూ.6 కోట్ల నుండి రూ.7 కోట్ల వరకు తీసుకుంటాడట. నితిన్ కు కార్లంటే చాలా ఇష్టం. అందుకే జాగ్వర్ ఎస్ఎఫ్, బీఎంయూయూ ఎక్స్ 5 కార్ లను సొంతం చేసుకున్నాడు.
అలాగే 1కోటి 20 లక్షలు ఖరీదు చేసే పోర్షే కయెన్, హోండా సీఆర్వీ, ఇన్నోవా క్రిస్టా లాంటి కార్లు నితిన్ దగ్గర ఉన్నాయి. 2013వ సంవత్సరంలో ఓ సొంత ప్రొడక్షన్ స్టూడియోని కూడా నిర్మించాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…