Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో ఆచార్య సినిమా ద్వారా కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయింది. అయితే భారీ నష్టాలను చవిచూసింది. చిరంజీవి కెరీర్లో అత్యంత దారుణమైన ఫ్లాప్ను మూటగట్టుకున్న సినిమాల్లో ఇదొకటిగా మారింది. ఈ క్రమంలోనే సినిమాకు దాదాపుగా రూ.84 కోట్ల మేర నష్టం వచ్చిందని అంటున్నారు. నష్టాలను చరణ్ భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య ఫెయిల్ అవ్వడం వెనుక ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ.. ప్రధానంగా చిరంజీవి ఈ సినిమా కథ విషయంలో కలగజేసుకున్నారని.. కనుకనే ఫెయిల్ అయిందని అంటున్నారు. దర్శకుడికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వలేదని.. చిరంజీవి కథలో మార్పులు చేయించారని.. కనుకనే సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నారు.
చిరంజీవి పాత తరానికి చెందిన ఐడియాలను ఈ సినిమా కథలో జొప్పించారని.. ఆయన కథకు మార్పులు చేశారని సమాచారం. కనుకనే దర్శకుడు కొరటాల శివ కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అయితే చిరంజీవి ఐడియాలు మంచివే. కానీ ఇప్పటి తరానికి అనుగుణంగా అవి ఉండవు. ఇప్పుడు కొత్త కొత్త దర్శకులు కొత్త ఐడియాలతో ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా కథలను రూపొందిస్తున్నారు. కనుక ఆ స్వేచ్ఛను దర్శకుడికే ఇచ్చి ఉంటే బాగుండేదని.. అప్పుడు ఆచార్య కథ మోడ్రన్గా ఉండేదని.. అది ఇప్పటి తరానికి కనెక్ట్ అయి ఉండేదని.. దీంతో సినిమా అంతగా ఫ్లాప్ కాకుండా.. కనీసం యావరేజ్ టాక్ను అయినా సొంతం చేసుకుని ఉండేదని.. అంటున్నారు.
అయితే సినిమా కథలో వేలు పెట్టడం వల్లే ఇలా జరిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇకపై సినిమాల కథల విషయంలో దర్శకులు, రచయితలకు స్వేచ్ఛను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయానికి చిరంజీవి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఆయన ఇకపై కథల విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కథ, డైలాగ్స్, దర్శకత్వం వంటి అంశాల్లో ఇకపై కలగజేసుకోకూడదని చిరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న భోళా శంకర్, గాడ్ ఫాదర్లతోపాటు త్వరలో తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమా విషయంలోనూ ఇకపై జోక్యం చేసుకోబోనని అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టులో చిరంజీవి గాడ్ ఫాదర్తో రానున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…