Bigg Boss Telugu 6 : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీలో బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా 24 గంటలు అందరినీ మెప్పించింది. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా అదిరిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పాపులర్ యాంకర్ ఉదయభాను, హీరో నందు, చలాకీ చంటి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ హాసన్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ వంటి పాపులర్ సెలబ్రిటీస్ ఈ బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు.
ఈ ఆగస్టు చివరి వారంలో గానీ సెప్టెంబర్ మొదటి వారంలో గానీ సీజన్ 6 ప్రారంభం కాబోతోందని సమాచారం. సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హోస్ట్ నాగార్జునపై పడింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గత సీజన్ లో నాగార్జున షో మొత్తానికి రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఇప్పుడు తాజాగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున ఏకంగా రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…