Bigg Boss Telugu 6 : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీలో బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా 24 గంటలు అందరినీ మెప్పించింది. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా అదిరిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పాపులర్ యాంకర్ ఉదయభాను, హీరో నందు, చలాకీ చంటి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ హాసన్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ వంటి పాపులర్ సెలబ్రిటీస్ ఈ బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు.
ఈ ఆగస్టు చివరి వారంలో గానీ సెప్టెంబర్ మొదటి వారంలో గానీ సీజన్ 6 ప్రారంభం కాబోతోందని సమాచారం. సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హోస్ట్ నాగార్జునపై పడింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గత సీజన్ లో నాగార్జున షో మొత్తానికి రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఇప్పుడు తాజాగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున ఏకంగా రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…