Bigg Boss 5 : రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పిన హౌజ్‌ మేట్స్‌.. అందరికీ అప్పులే ఉన్నాయిగా..!

November 29, 2021 8:13 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చూస్తుండ‌గానే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక కేవ‌లం మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 7 గురు స‌భ్యులు ఉండ‌గా, వీరిలో విన్న‌ర్ ఎవ‌రు, టాప్ 5లో ఎవ‌రు ఉంటారు.. అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొని ఉంది. అయితే ఈ సారి బిగ్ బాస్ విజేత‌ల‌కు రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు నాగార్జున తెలిపారు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్‌.

Bigg Boss 5 : రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పిన హౌజ్‌ మేట్స్‌.. అందరికీ అప్పులే ఉన్నాయిగా..!

మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా’ అని చెప్పుకొచ్చింది.

శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక’ అని చెప్పాడు. ‘కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థను నెలకొల్పాలన్న కోరికను నెరవేర్చుకుంటా’ అని చెప్పాడు రవి.

ఇక కాజ‌ల్ మాట్లాడుతూ 30 లక్ష‌ల రూపాయ‌ల అప్పు ఉంది. అది తీర్చుకుంటా. అలాగే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కట్టాలనుకుంటున్నాన‌ని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్‌ పెడతానన్నాడు. మానస్‌ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేస్తానని చెప్పాడు.

షణ్ముఖ్‌.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్‌ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో రూ.25 లక్షలు ఇస్తానన్నాడు.

సిరి శ్రీహాన్‌ పేరెంట్స్‌కు ఉన్న రూ.10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. ఇక మ‌ధ్య‌లో ఇంటి స‌భ్యుల‌తో బొమ్మ‌ల‌ను గుర్తు ప‌ట్టే ఆట‌ల‌తోపాటు బ్లైండ్ వీల్ చైర్ ఆట‌లు ఆడించాడు నాగార్జున‌. ఎలిమినేష‌న్ టైంలో హైడ్రామా న‌డిచింది. చివ‌ర‌కు ర‌వి, కాజ‌ల్ మిగ‌ల‌గా ఇందులో కాజ‌ల్ కోసం ఎవిక్ష‌న్ పాస్ ఉప‌యోగిస్తాడు స‌న్నీ. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ ప్రకటించాడు.

స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న రవి ఎలిమినేట్‌ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్‌ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్‌ జర్నీలో ఎవరు పాస్‌, ఎవరు ఫెయిల్‌ ? అనే గేమ్‌ ఆడాడు. షణ్ను పాస్‌ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు.

శ్రీరామ చంద్రలో అన్నీ పాజిటివ్‌ లే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెబుతూ అతడిని పాస్‌ చేశాడు. ఫ్రెండ్‌ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్‌ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. టాప్‌ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్‌ చేశాడు. మానస్‌ను చూసి చాలా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చాడు ర‌వి. నిజంగా రవి ఎలిమినేష‌న్ అంద‌రికీ పెద్ద ట్విస్ట్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment