Anchor Suma : ప్రముఖ యాంకర్ సుమ.. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ సందడి ఓ రేంజ్లో ఉంటుంది. వేదిక ఏదైనా సరే సుమ ఉందంటే అక్కడ నవ్వుల సునామీ వస్తుంది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్గా కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా.. స్టేజ్పై హడావుడి అంతా సుమదే. సుమ రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక బుల్లితెరపై రాణిస్తున్న సుమ సినిమాల్లో నటించి చాలా కాలమే అయింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా జయమ్మ పంచాయతీ పేరుతో వెండితెరపై మళ్లీ కనిపించనుంది. సుమ ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్నాడు. మే 6న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో.. సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైంది. ఈ క్రమంలో సుమక్క అంటూ టైటిల్ సాంగ్ వేశారు. ఇక ఆలీతో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు పంచుకుంది సుమ. ఈ క్రమంలోనే తన భర్తతో రాజీవ్ కనకాలతో జరిగిన గొడవలపై స్పందించింది.
రాజీవ్, సుమ విడిపోయారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దానిపై స్పందన ఏంటని అడగగా, తనకు, రాజీవ్ కు మధ్య ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నో సార్లు గొడవలు జరిగాయని చెప్పింది. అయితే.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా సులువని.. తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం మాత్రం చాలా కష్టమని తెలిపింది. ఈ విషయాన్ని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఇక తనకు సినిమాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని.. అయితే, ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతోనే ఇంతకాలం ఆగానని తెలిపింది. చివరకు జయమ్మ పంచాయతీ సినిమా వచ్చిందని చెప్పింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్, మోహన్బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్బాబు అని ఠపీమని చెప్పింది.
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…