Anchor Shyamala : బుల్లితెర ఫేమస్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. సీరియల్స్, వంటల ప్రోగ్రాంలు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బాగానే ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ రెండో సీజన్తో శ్యామలకు క్రేజ్ వచ్చింది. గీతామాధురి, శ్యామల, యాంకర్ దీప్తి గ్యాంగ్.. ఆ సీజన్లో బాగానే హల్చల్ చేసింది. మధ్యలో ఎలిమినేట్ అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు శ్యామల బలైపోయింది. అయితే ఇటీవల తన భర్తపై వచ్చిన ఆరోపణలపై శ్యామల కూడా వార్తలలోకి ఎక్కింది.
శ్యామల భర్తపై ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు నరసింహా. తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు.
రీసెంట్గా యాంకర్ శ్యామల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్ కనకాల, తనీష్లతోపాటు సింగర్ గీతా మాధురి సహా పలువురు హాజరయ్యారు. అయితే ఈ ఖరీదైన విల్లాని మొత్తం పాలరాతితో నిర్మించడం విశేషం.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…