Amazon Prime : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన యూజర్లకు షాకిచ్చింది. వార్షిక సభ్యత్వ రుసుమును పెంచుతున్నట్లు తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఇప్పటి వరకు ఏడాదికి రూ.999 చెల్లిస్తే మెంబర్ షిప్ వచ్చేది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీలు, సిరీస్లు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అమెజాన్ సైట్లోనూ వస్తువులను ఎలాంటి డెలివరీ చార్జిలు లేకుండా వేగంగా డెలివరీ పొందవచ్చు. అయితే ప్రైమ్ మెంబర్ షిప్ చార్జిని పెంచుతున్నట్లు తెలిపింది.
అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ సర్వీస్ను తొలిసారిగా 2016లో లాంచ్ చేసింది. అప్పట్లో రూ.499కు ఏడాది మెంబర్షిప్ను ఇచ్చారు. 2017లో ఆ రుసుమును రూ.999 చేశారు. ఇప్పటి వరకు అదే రుసుము కొనసాగుతూ వచ్చింది. కానీ దాన్ని రూ.500 మేర పెంచారు. దీంతో ఇకపై యూజర్లు ఏడాదికి రూ.1499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ను పొందాల్సి ఉంటుంది.
అయితే కొంతకాలం పాటు పాత చార్జినే వసూలు చేస్తామని అమెజాన్ తెలిపింది. అందువల్ల ప్రస్తుతానికి రెన్యువల్ లేదా కొత్తగా మెంబర్షిప్ తీసుకుంటే రూ.999 చెల్లిస్తే చాలు. అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యువల్ తేదీ దగ్గర పడుతున్నవారు లేదా కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాలని అనుకుంటున్నవారు ఇప్పుడే ఆ మెంబర్షిప్ను తీసుకుంటే మంచిది. దీంతో రూ.500 ఆదా చేయవచ్చు.
ఇక 18 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ప్రైమ్ యూత్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వయస్సు ఉన్న యూజర్లు వార్షిక సభ్యత్వం తీసుకుంటే రూ.500, 3 నెలల మెంబర్షిప్ తీసుకుంటే రూ.165 క్యాష్బ్యాక్ ఇస్తారు.
కాగా అమెజాన్ ప్రైమ్కు చెందిన నెలవారీ, 3 నెలల, వార్షిక మెంబర్షిప్ ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* నెల వారీ ప్లాన్ – పాత చార్జి రూ.129, కొత్త చార్జి రూ.179
* 3 నెలల మెంబర్షిప్ – పాత చార్జి రూ.329, కొత్త చార్జి రూ.459
* ఏడాది మెంబర్షిప్ – పాత చార్జి రూ.999, కొత్త చార్జి రూ.1499
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…