Allu Arjun : మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రం విడుదలకి సిద్ధం కాగా, దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సెట్స్పై పలు మల్టీ స్టారర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజగా బన్నీతోపాటు బాలీవుడ్ హీరో కాంబినేషన్లో ఓ బడా మల్టీ స్టారర్ రూపొందనుందనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.
ఇటీవల జెర్సీ హిందీ ట్రైలర్ లాంచ్ కాగా, ఈ కార్యక్రమానికి ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ తదితరులు హాజరయ్యారు. ఊహించని విధంగా ఈ చిత్ర బృందానికి ఆసక్తికర ప్రశ్నలు వేశారు. అల్లు అరవింద్ ని బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నా మనసులో ఆలోచన రాలేదని నేను చెప్పను, ప్రణాళికలు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం లేదా వేదిక కాదు. సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాము” అని అన్నారు. ఆయన మాటల తర్వాత ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్లో అరవింద్ ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…