Chiranjeevi : టాలీవుడ్ లో హీరో ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఆరు పదుల వయస్సు వచ్చినా సరే.. తగ్గేదేలే అంటూ హీరోగానే కొనసాగుతాడు. ఇప్పుడు కొంత మార్పు వచ్చి విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పటికీ ఫాదర్ క్యారెక్టర్ లు మాత్రం అస్సలు చేయరు. కానీ హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. మూడు పదుల వయసు దాటితే చాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.. అదృష్టం బాగుంటే ఇంకో 5 సంవత్సరాలు హీరోయిన్ లుగా నటిస్తుంటారు. కానీ ఆ తరవాత మాత్రం అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సిందే.. అంతే కాకుండా అవసరమైతే తల్లి పాత్రలు అయినా వేయక తప్పుదు. ఇక కొంతమంది హీరోయిన్ లు అయితే తాము ఆడిపాడిన హీరోలకే తల్లిగా చేసే అవకాశాలు కూడా వస్తాయి.
అలా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన ఇద్దరు హీరోయిన్ లు ఆయనకు తల్లిగా నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరు.. వారు తల్లిగా చేసిన సినిమాలేవి అనేది చూద్దాం.. 1979లో జయసుధ, చిరంజీవి కాంబినేషన్ లో ఇది కథ కాదు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి బాల చందర్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా మగధీరుడు సినిమాలోనూ చిరంజీవి జయసుధ హీరోహీరోయిన్ లు గా నటించారు. కానీ 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిక్షావోడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. దీంతో అంతా షాకయ్యారు.
ఇదిలా ఉంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సుజాత హీరో, హీరోయిన్ లుగా కలిసి నటించారు. కానీ ఆ తరవాత సీతాదేవి సినిమాలో సుజాత చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. ఇక అక్కడితో ఆగకుండా 1995లో మెగాస్టార్ హీరోగా బిగ్ బాస్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన రోజా హీరోయిన్ గా నటిస్తే.. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు తల్లి పాత్రలో సుజాత నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…