Actress Laya : తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. భద్రం కొడుకో అనే మూవీ ద్వారా 1992లో సినీ తెరకు పరిచయం అయింది. తరువాత స్వయంవరం సినిమాతో ఈమెకు బాగా పేరు వచ్చింది. దీంతో ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తరువాత మనోహరం, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, పెళ్లాంతో పనేంటి, మిస్సమ్మ వంటి చిత్రాల్లో నటించింది. ఇవన్నీ ఈమెకు మంచి హిట్స్ను అందించాయి. అయితే 2006లో ఈమె పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఈమె భర్తతో కలసి అమెరికాలోనే ఉంటోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం లయ ఎల్లప్పుడూ యాక్టివ్గానే ఉంటోంది. పలు పాటలకు డ్యాన్స్లు చేస్తూ అలరిస్తోంది. గతంలో సర్కారు వారి పాట మూవీలోని కళావతి పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఇక తాజాగా మళ్లీ సంప్రదాయబద్దమైన డ్యాన్స్ చేసి అలరించింది. లయ చేసిన డ్యాన్స్ ఎంతో అద్భుతంగా ఉండడం విశేషం. ఈమె స్వతహాగా నృత్యకారిణి. కనుక సంప్రదాయ నాట్యం చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అందులో భాగంగానే తాజాగా ఈమె ఓ పాటకు నాట్యం చేసి అలరించింది. ఆ వీడియోను ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది.
ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లోనూ నటించింది. ఈమె చివరి సారిగా 2018లో రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంథోనిలో నటించింది. హీరోయిన్ కు తల్లి పాత్ర చేసింది. విజయవాడకు చెందిన ఈమె తెలుగు హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సాధించింది. కూచిపూడి డ్యాన్స్ చేయడంలో లయ దిట్ట అని చెప్పవచ్చు. ఈమె మనోహరం, ప్రేమించు చిత్రాలకు ఉత్తమ నటిగా వరుసగా రెండు నంది అవార్డులను కూడా సాధించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…