Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల తర్వాత ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ను ముమ్మరం చేయనుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవితోపాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు.
ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్కు జోడీగా పూజా హెగ్డె నటించింది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్లో గెస్ట్ పాత్ర పోషించిన పూజా హెగ్డెని చూపించారు కానీ, ప్రధాన కథానాయిక అయిన కాజల్ ఒక్క ఫ్రేములో కూడా కనిపించలేదు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముందుగా ఆచార్య చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిషను తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆచార్యలో తన పాత్రకు కనీస ప్రాధాన్యత లేదనే కారణంగానే త్రిష తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాజల్కి మెగా ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వలన ఆమెని ఎంపిక చేశారు. అయితే ట్రైలర్ విడుదల తర్వాత త్రిష ఎందుకు తప్పుకుందనేది అర్ధమైంది. కాజల్ కేవలం రెమ్యునరేషన్ కోసమే ఈ సినిమా ఒప్పుకుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మెగాస్టార్ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, డైలాగ్స్ తో కొరటాల శివ.. ఆచార్య చిత్రాన్ని వడ్డించబోతున్నారు. సినిమా మొత్తం దేవాలయాలు, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు ఉంది. దీంతో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…