బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఇవి చోటుచేసుకుంటాయట. ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సినిమాలో కూడా మనం ఎన్నో చూశాం. అయితే ఇవి ఉగాది తర్వాత చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2023 నుండి 2024 మధ్యలో సమాజంలో అనేక విలువలు దిగజారి పోతాయని చెప్పారు వీరబ్రహ్మం గారు. ముఖ్యంగా వివాహ కట్టుబాట్లని మర్చిపోయి ఇతరల వ్యామోహంలో పడిపోతారట. డబ్బు కోసం మనుషులు చావడానికి, చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారట.
అదే విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుండి రాళ్లు పడి ఇబ్బందులు కలుగుతాయట. అనేక రకాల వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2025- 26 మధ్యలో భారత దేశంలో అనుకోని సంఘటనలేవో జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందర్నీ సత్ప్రవర్తన వైపు వెళ్లేలా చేస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.
ప్రపంచ జనాభా 2065 నాటికి పడిపోతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. 2024 నాటికి కొత్త నక్షత్రం ఆకాశంలో ఉద్భవిస్తుంది. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు వేస్తాయి. నెత్తురు కక్కుతూ అనారోగ్య సమస్యలతో జనాలు చనిపోతారు. జంతువులు కూడా అలాగే చచ్చిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఉంది. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన ఉన్నవాళ్లు భయంకరమైన కష్టాలు పడి మరణిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.
అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మనుషుల్ని చంపుతాయని కూడా చెప్పారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ కారణంగా గొడవ పడి చనిపోతారట. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయని కూడా కాలజ్ఞానంలో చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనపడకుండా మాయమైపోతుందని కూడా చెప్పారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇవి జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆయన చెప్పిన చాలా విషయాలు జరగడం మనం విన్నాము. చూశాము.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…