How To Increase Breast Milk : గర్భం ధరించిన మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న సంగతి తెలిసిందే. కాస్త చిన్న తప్పు చేసినా అది బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. లేదా పుట్టబోయే బిడ్డకు అనారోగ్య సమస్యలు రావచ్చు. కనుక గర్భిణీలు ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. అయితే డెలివరీ అయ్యాక కూడా తల్లులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు పాలిస్తారు కాబట్టి వారు తమ ఆహారాన్ని కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బాలింతల్లో కొందరికి పాల ఉత్పత్తి సరిగ్గా ఉండదు. అలాంటి వారు కింద చెప్పిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలింతలు ఓట్ మీల్ను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి. దీంతో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే పాలను వృద్ధి చేయడంలో మెంతులు కూడా పనిచేస్తాయి. మెంతుల నీళ్లను తాగవచ్చు. లేదా కాస్త మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తాగాలి. అలాగే మెంతులతో చేసిన ఆరోగ్యకరమైన కుకీస్ను కూడా తినవచ్చు. కాకపోతే వీటిలో చక్కెర తక్కువగా ఉండేలా చూడాలి. ఇక రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. సైంటిస్టులు దీన్ని రికమెండ్ కూడా చేస్తున్నారు.
బాలింతలు బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతోపాటు శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో బిడ్డకు చక్కని స్వచ్ఛమైన పాలు లభిస్తాయి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. నువ్వులతో చేసిన పిండి వంటలను తింటే ఫలితం ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కనుక తక్కువ మోతాదులో తినాలి.
ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల బాలింతల్లో పాలు బాగా పడతాయి. అలాగే అల్లం, బొప్పాయి, శనగలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితోనూ ఫలితం ఉంటుంది. అయితే బాలింతలు తమ ఆహారం మార్చే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం. కొందరికి ఈ ఆహారాలు పడకపోవచ్చు. కనుక వైద్యుల సలహా మేరకు డైట్ ను మార్చాల్సి ఉంటుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…