Smoke Pan : పెళ్లిళ్లు లేదా ఇతర శుభ కార్యాల విందుల్లో మనకు అనేక రకాల వంటకాలు లభిస్తుంటాయి. వెజ్, నాన్ వెజ్ ప్రియుల జిహ్వా చాపల్యానికి తగినట్లుగా అతిథులు అనేక రకాల వంటకాలను సిద్ధం చేసి ఉంచుతారు. ఈ మధ్య కాలంలో ఆర్థికంగా స్థితివంతులు చాలా మంది విందుల్లో వందలకు పైగా వెరైటీ పుడ్స్ను వడ్డిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. వాటిల్లో ఆహారాలను తినే ముందు ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఓ బాలిక అలాగే వెరైటీగా ఉంటుందని ఓ స్మోక్ పాన్ తిన్నది. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉండలేదు. ఆమె చిన్న పేగుకు రంధ్రం పడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓ వివాహ విందులో వందలకు పైగా వెరైటీ వంటకాలను వడ్డించారు. వాటిల్లో స్మోక్పాన్ కూడా ఉంది. ఈ క్రమంలోనే దానికి అట్రాక్ట్ అయిన ఓ బాలిక స్మోక్ పాన్ను తిన్నది. అయితే మొదట అంతా బాగానే అనిపించినా 2-3 రోజులకు ఆమెకు పొట్టలో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి చూడగా ఆమె చిన్న పేగుకు రంధ్రం పడిందని గుర్తించారు. ఆమె తిన్న స్మోక్ పాన్ వల్లే ఇలా జరిగిందని తేల్చారు.
ఇక విషయం తెలిసిన వైద్యులు ఆ బాలికకు శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు ఇంట్రా ఆపరేషన్ ఓజీడీ స్కోపీ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో ఆ బాలిక కోలుకున్న తరువాత ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. స్మోక్ పాన్ పిల్లలకు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అందులో నైట్రోజన్ కంటెంట్ అధికంగా ఉంటుందని, అందువల్లే ఇలా జరిగిందని వారు అంటున్నారు. కనుక ఇకపై స్మోక్ పాన్ తినే ముందు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందుల పాలు కాక తప్పదు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…