సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ చదివి ఉండి సంబంధిత కోర్సులను చేసి ఉంటే చాలు, టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ పొందవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెక్ మహీంద్రా సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ ఏడాది చివరి వరకు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గడువు ఉంది. అంటే ఇంకా చాలా కాలం ఉంది కనుక అభ్యర్థులు ఆయా కోర్సుల్లో శిక్షణ పొంది మరీ ఈ జాబ్లకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐబీఎం ఏనీఐ కనెక్ట్ బేసిక్ స్కిల్స్, ఈఎస్క్యూఎల్, ఎక్స్ఎంఎల్ వంటి కోర్సులను చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఇక ఈ పోస్టులకు గాను ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అభ్యర్థులు https://careers.techmahindra.com/Registration.aspx?JobId=NQAAADkAAAAzAAAANwAAADgAAAA=-k6fqRuY78iY= అనే లింక్ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలను కూడా అభ్యర్థులు ఇదే లింక్లో తెలుసుకోవచ్చు. కనుక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…