దేశవ్యాప్తంగా ఉన్న పలు జోన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి రైల్వే శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 32,438 పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ పోస్టులకు గాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఫిబ్రవరి 23 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు.
అభ్యర్థులు మరిన్ని వివరాలకు గాను https://indianrailways.gov.in/railwayboard/ అనే అధికారిక వెబ్ సైట్ను సందర్శించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీకి చెందిన అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పుర్, కోల్కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతిలో లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 01.07.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనం రూ.18వేలు చెల్లిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.250 చెల్లిస్తే చాలు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…