Sleep : మనిషి నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, వేళకు భోజనం చేయడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటలు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలకైతే ఆ సమయం ఇంకా పెరుగుతుంది. వారు రోజుకు 10 గంటల పాటు నిద్రపోవాలి. అయితే నేటి ఆధునిక యుగంలో నిత్యం ఒత్తిళ్లు, అనారోగ్యాలతో సావాసం చేస్తున్న మనం నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఈ క్రమంలో రోజుకు కనీసం తక్కువలో తక్కువ 6 గంటల పాటైనా నిద్రపోకపోతే కలిగే దుష్ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం కనీసం 6 గంటల పాటైనా నిద్రపోకపోతే శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో శక్తి ఖర్చు కావడం తగ్గుతుంది. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ వంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరేలా చేస్తుంది. ఏకాగ్రత నశిస్తుంది. దేనిపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేం. ప్రధానంగా వాహనాలు నడుపుతున్నప్పుడు ఏకాగ్రత లోపించడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా నిద్రపోక పోతే శరీరానికి సోమరితనం అలవాటు అవుతుంది. రోజూ మజ్జుగా మబ్బుగా ఉంటారు. ఉత్సాహంగా ఉండరు. బద్దకంగా ఉంటుంది. కొందరికైతే మద్యం సేవించినట్టు మత్తుగా ఉంటుంది.
నిద్ర సరిగ్గా పోకపోతే అది మెదడుపై డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది. దీంతో మెదడు పనితనం నెమ్మదిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏదీ సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోని పురుషుల్లో వీర్యం ఉత్పాదకత తగ్గుతుంది. ఫలితంగా పిల్లలు త్వరగా పుట్టరు. డిప్రెషన్ దరి చేరుతుంది. ఎంత సేపూ ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. సంతోషం అనేది దూరమవుతుంది.
స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి తగ్గుతుంది. ఆ కార్యంపై అస్సలు మనస్కరించదు. పూర్తిగా అయిష్టత ఏర్పడుతుంది. వయస్సు తక్కువగా ఉన్నా త్వరగా చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. కనుక నిత్యం తగినంతగా నిద్ర పోవడం కచ్చితంగా అవసరమే. పైన చెప్పిన విషయాలన్నింటినీ పలువురు సైంటిస్టులు పరిశోధించి నిరూపించారు కూడా. కనుక నిద్ర పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించకండి. కనీసం 6 గంటల పాటు అయినా సరే నిద్రించండి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…