Fish : మధుమేహం.. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్-1, మరొకటి టైప్-2. క్లోమ గ్రంథి అస్సలు పనిచేయకపోతే టైప్-1, పనిచేస్తున్నా దాన్నుంచి విడుదలయ్యే ఇన్సులిన్ ను శరీరం సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు టైప్-2 మధుమేహం వస్తాయి. అయితే ఏది వచ్చినా ఆయా వ్యక్తుల శరీరాల్లో గ్లూకోజ్ ఎప్పుడూ రక్తంలో ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఈ వ్యాధి శరీరంలో అనేక అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. అలాగని మధుమేహం మందులకు లొంగేది కాదు. నియంత్రణతోనే దీన్ని లొంగదీయవచ్చు.
అయితే ఎన్నో రకాల డయాబెటిక్ మందులు ఆయా వైద్య విధానాల్లో మనకు అందుబాటులో ఉన్నా వారానికి రెండు సార్లు చేపలను తింటే డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చట. అవును, మీరు విన్నది నిజమే. వారానికి రెండు సార్లు చేపలను తింటే దాంతో డయాబెటిస్ నయమవుతుందని పలువురు సైంటిస్టులు ఈ మధ్యే కనుగొన్నారు. లండన్ కు చెందిన ఓ పరిశోధక బృందం తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. వారు ఏం చేశారంటే 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సున్న 3614 మంది టైప్-2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లను ఆహారంలో భాగంగా ఇచ్చారు.
నిజానికి ఈ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనేవి మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు. ఇవి చేపల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే అలా వారికి కొన్ని వారాల పాటు సదరు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లను ఇవ్వగా అనంతరం తెలిసిందేమిటంటే ఆ రోగుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 48 శాతం వరకు తగ్గాయట. అంతేకాదు, డయాబెటిస్ వల్ల వచ్చే కంటి, మూత్ర పిండ సమస్యలు దాదాపుగా చాలా వరకు తగ్గాయని సదరు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో లండన్ సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలను తింటే దాంతో మన శరీరానికి పైన చెప్పినట్టుగా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. చూశారుగా, చేపలను తినడం వల్ల ఎంతటి అద్భుతమైన ఉపయోగం తెలిసిందో. కనుక చేపలను మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దాంతో షుగర్ మాత్రమే కాదు, ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…