Rice Water For Beauty : చాలామంది, అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే, ప్రతి ఒక్కరు కూడా, అందంగా కనపడాలని అనుకుంటూ ఉంటారు. అందంగా కనపడటం కోసం, అనేక రకాల చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. మీరు కూడా, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా, ఇలా చేయండి. మనం బియ్యాన్ని కడిగి ఆ నీళ్ళని పారబోస్తూ ఉంటాం. కానీ, నిజానికి బియ్యం కడిగిన నీళ్లు వలన ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు. బియ్యం కడిగి, మనం అన్నం రోజు తింటాము. కానీ ఆ నీళ్ళని పారబోస్తూ ఉంటాము. కానీ, బియ్యం కడిగిన నీళ్ళని ఇలా వాడుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయి.
విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. బియ్యం కడిగిన నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యాన్ని ముందు గిన్నెలో పోసి, నీళ్లు పొయ్యాలి. రెండు సార్లు కడిగితే దుమ్ము అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ నీటిని పోసి, ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట అయ్యాక బియ్యం కలపండి. కాస్త మసకగా నీళ్లు తేలుతాయి. ఈ నీటిని ఇంకో పాత్రలోకి వేసుకోవాలి. అంతే బియ్యం కడిగిన నీళ్లు రెడీ అయిపోయాయి.
నీటిని మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే, రెండు మూడు రోజులు వాడుకోవడానికి అవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళని ఉపయోగించడం వలన మొటిమలు కూడా తగ్గిపోతాయి. బియ్యం కడిగిన నీళ్ళల్లో కాటన్ ముంచి ముఖానికి, మెడకి రాసుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి. ముఖం పూర్తిగా ఆరిపోయాక, నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేయడం వలన, చర్మం కాంతివంతంగా మారుతుంది.
మృదువుగా తయారవుతుంది. కాటన్ ముంచి, మొటిమలు ఉన్నచోట రాస్తే, మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీళ్లు టోనర్ గా కూడా పనిచేస్తాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎలర్జీ వంటి సమస్యలు కూడా ఉండవు. తలస్నానం చేసిన తర్వాత, బియ్యం కడిగిన నీళ్ళని తల మీద పోసుకుని రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే, జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…