Mouth : మనం ఎలా అయితే మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తామో, అలానే పంటి ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి. మన పళ్ళు బాగుంటే మన నవ్వు బాగుంటుంది. మరి నవ్వు బాగుంటే మనం అందంగా కనిపిస్తాం. అలాగే పళ్ళు కనుక పాడైతే కచ్చితంగా డెంటిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. పైగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది.
ప్రతి రోజు కూడా శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వలన బ్యాక్టీరియా నోట్లో తయారవుతుంది. గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలని తీసుకువస్తుంది. కాబట్టి కచ్చితంగా పళ్ళు శుభ్రంగా తోముకోవాలని డెంటిస్టులు అంటున్నారు. అయితే బ్రష్ చేసుకునే విషయంలో చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
ఈ ప్రశ్నలు మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకోండి. చాలామంది పళ్ళు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ ని ఉపయోగిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ముందు బ్రష్ చేసుకుని, ఆ తర్వాత మీరు మౌత్ వాష్ ని ఉపయోగించవచ్చు. అలానే పళ్ళు తోముకునేటప్పుడు బ్రష్ మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండే దానిని ఉపయోగించకూడదు. మధ్యస్తంగా ఉండే దానిని ఉపయోగించాలి.
బాగా ఎక్కువ ఒత్తిడి పెట్టి బ్రష్ చేయడం కూడా మంచిది కాదు. సున్నితంగా బ్రష్ చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల పాటు ప్రతి రోజూ బ్రష్ చేసుకోవాలి. అలాగే రోజుకి ఒకసారి కంటే ఎక్కువ సార్లు బ్రష్ చేసుకోవచ్చు. అప్పుడే పళ్ళు బాగుంటాయి. ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకోవాలి. అలానే మళ్లీ రాత్రి కూడా బ్రష్ చేసుకోవాలి. ఏదైనా దంత సమస్యలు కలిగినట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…