Ginger Juice : నిత్యం మనం అల్లంను వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక మాంసాహార వంటకాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవలం రుచికే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలో, అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ అల్లం బాగా ఉపయోగపడుతుంది. మరి అల్లంతో మనం ఎలాంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా.
అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం రసం సేవిస్తే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుంది. అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సర్) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి.
అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం రసాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజులకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో అల్లం మెరుగ్గా పనిచేస్తుంది. నిత్యం అల్లం రసం సేవించడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. కనుక అల్లం రసాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఒక్క స్పూన్ తాగినా చాలు.. ఎన్నో లాభాలను పొందవచ్చు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…