Diabetes Symptoms : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, చాలామంది షుగర్, బీపీ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ వచ్చిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరిక శ్రమ లేకపోవడం అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వలన కూడా, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వంటివి కూడా షుగర్ ని కలిగిస్తాయి.
అధిక బరువు ఉన్నవాళ్లు, వంశపార్యం పరంగా మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక బరువు, తప్పుడు ఆహార పదార్థాలను తీసుకోవడం, షుగర్ రావడానికి కారణం అవుతాయి. బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది. ఇలా, ఈ పద్ధతుల్ని కనుక పాటించినట్లయితే, డయాబెటిస్ రిస్క్ బాగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.
అలానే, చాలామంది వ్యాధి ముదిరే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డయాబెటిస్ వచ్చే ముందు, ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనబడతాయి. సమయానికి వాటిని గుర్తించాలి. ఆలస్యం చేస్తే టైప్ టు డయాబెటిస్ అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన అలసట, అధిక దాహం వంటి లక్షణాలు ముందు కనబడతాయి.
ఆకలి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటాయి. ఇలా లక్షణాలని గుర్తించి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. షుగర్ ఉన్నట్లయితే, ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. నారింజ, కివి వంటివి మేలు చేస్తాయి. ఆల్కహాల్, వేయించిన ఆహార పదార్థాలు, బియ్యం, బంగాళదుంపలు ఎక్కువగా తీసుకోకూడదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…