Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ కామన్ గా వస్తున్నాయి. షుగర్ రాకూడదని, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. పైగా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. షుగర్ వచ్చిన తర్వాత, ఆహారం పట్ల అనేక నియమాలని పాటిస్తున్నారు. అయితే, షుగర్ తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే, అల్పాహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ తో బాధపడే వాళ్ళు, ఈజీగా దీనిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. రాత్రంతా నల్ల శనగలని నానబెట్టి, మరుసటి రోజు కుక్కర్ లో ఉడకపెట్టుకుని, తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి బాగుంటుంది. అల్పాహారానికి బదులుగా మీరు ఇలా తీసుకోవచ్చు. అలానే, షుగర్ తో బాధపడే వాళ్ళు మినప పప్పుని తీసుకుంటే కూడా మంచిది. అయితే, మినప పప్పుని తీసుకునేటప్పుడు మీరు పొట్టు పప్పును తీసుకోండి. షుగర్ పేషెంట్లకు ఇది బాగా మేలు చేస్తుంది.
ఈ మినప పప్పు తీసుకుంటే, చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అలానే, షుగర్ తో బాధపడే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. రాగి దోశ వంటి వాటిని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు తీసుకుంటే మంచిది.
గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, గుడ్లు తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని స్టడీ చెప్తోంది. బెర్రీస్ తో గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రాత్రి పూట చియా సీడ్స్ ని తీసుకుంటే షుగర్ పేషంట్లకి ఎంతో మేలు కలుగుతుంది. చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని ఇది తగ్గించగలదు. అలానే ఓట్ మీల్ ని కూడా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది. మల్టీ గ్రైన్ అవకాడో టోస్ట్ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా షుగర్ తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుని షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…