Cancer : క్యాన్సర్.. నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే ప్రమాదకరంగా మారవచ్చు. అంతే కాదు ఇవి చర్మ క్యాన్సర్కు దారి తీసే అవకాశం ఉంటుంది. అలసట, ఆయాసం ఎక్కువగా, ఎక్కువ సేపు ఉంటే అది పెద్దపేగు లేదా పొట్టకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దాని లక్షణాలను పరిశీలించాల్సిందే. ఛాతి చుట్టూ ఎరుపుదనం, నిపుల్స్ నుంచి డిశ్చార్జి వంటి లక్షణాలు ఉంటే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్గా పరిగణించాలి.
నోట్లో లేదా నాలుకపై తెల్లని ప్యాచ్లు ఎక్కువ కాలం పాటు ఉంటే అది ప్రమాదకరమైన ఓరల్ క్యాన్సర్కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్కు సూచనగా భావించాలి. కడుపులో ఎల్లప్పుడూ నొప్పిగా ఉండడంతోపాటు ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటే దాన్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా అనుమానించాలి. ఆహారాన్ని మింగడంలో ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ కావచ్చు.
లింఫ్ గ్రంథులు లేదా గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బి ఉన్నా దాన్ని గొంతు క్యాన్సర్గా అనుమానించాలి. వృషణాల సైజ్లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్గా భావించాలి. మ్యూకస్ లేదా ఉమ్మిలో రక్తం వస్తుంటే దాన్ని ఊపిరితిత్తులు లేదా ఓరల్ క్యాన్సర్గా భావించాలి. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తున్నా ఆ పరిస్థితిని ప్రోస్టేట్ క్యాన్సర్గా అనుమానించాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…