Beauty Tips : అందంగా కనిపించడం కోసం నేడు మహిళలు అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లడం లేదంటే వివిధ రకాల క్రీములు, పౌడర్లు గట్రా రాయడం, అవసరమైతే న్యూట్రిషన్ పిల్స్ మింగడం వంటి అనేక పనులు చేస్తున్నారు. కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను మాత్రం వారు పట్టించుకోవడం లేదు. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బాధ లేకుండా అత్యంత సహజ సిద్ధమైన పద్ధతులతో కూడిన చిట్కాలను పాటిస్తే కేవలం 2 వారాల్లోనే చర్మ కాంతిని పెంచుకోవచ్చు. దీంతో చర్మం మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ కీరదోస రసంలో కొంత నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అనంతరం చర్మం పొడిగా అయ్యాక కడిగేయాలి. దీంతో చర్మం కాంతిని పొందుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. ముల్లంగి రసాన్ని తీసి దాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. ఉసిరి కాయ రసం 1 టీస్పూన్, తేనె 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. అనంతరం ముఖానికి రాసుకోవాలి. రాత్రి పూట ఇలా చేయాలి. ఉదయాన్నే కడిగేయాలి. దీంతో చర్మం ఆరోగ్యాన్ని పొందుతుంది. కాంతివంతంగా మారుతుంది.
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా పెరుగును తీసుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే కేవలం 2 వారాల్లోనే ముఖం సౌందర్యాన్ని పొందుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో ఉన్న మృతకణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్రమాలను సమాన భాగాల్లో తీసుకుని ముఖానికి రాయాలి. కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి కణాలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
నారింజ పండు తొక్కలను ఎండ బెట్టి పొడి చేయాలి. ఈ పొడికి కొంత పాలు కలిపి అనంతరం వచ్చే మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంత సేపు ఆగాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా మారడమే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది. బొప్పాయి పండు ముక్కను తీసుకుని దాన్ని పేస్ట్లా చేసి అందులో నిమ్మరసం కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు ఆగాక కడిగేసుకోవాలి. దీంతో చర్మంపై ఉండే మృత కణాలు పోయి కొత్త కణాలు ఏర్పడుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒక టొమాటోను తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్లా మార్చుకోవాలి. అందులో కొంత నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మంచి రంగును సొంతం చేసుకుంటుంది. మృదువుగా కూడా మారుతుంది.
ఒక టేబుల్ స్పూన్ తేనె, అంతే మోతాదులో పసుపును తీసుకుని మిశ్రమంగా కలిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…