వేరుశెనగ పల్లీ కారం అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో పల్లీ కారం తినడానికి ఇష్టపడతారు. ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. మరి అంతే రుచికరమైన పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
* వేరుశనగ పల్లీలు రెండు కప్పులు
* వెల్లుల్లి ఒక గడ్డ
* ఎండుమిర్చి ఒక 7
*చిన్న సైజు బెల్లం ముక్క (ఇష్టముంటేనే)
*ఉప్పు
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వేరుశనగ పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.ముందుగా రుబ్బు రోలులో వేయించుకున్న ఎండు మిర్చి,రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.అందులో వేరుశనగ పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయిన తరువాత వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి. కొందరికీ ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు.ఈ విధంగా తయారైన వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…