సాధారణంగా కొందరు చేపలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. చేపలలో ముళ్ళు ఉంటాయని భావించి చేపలను పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ చేపలు తినడం వల్ల ఎన్నో పోషకాలను మనం పొందవచ్చు. అయితే చేపలను పులుసుగా తయారు చేసుకొని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చేపలు ఒక కిలో
*వెల్లుల్లి ఒకటి
*ఉల్లిపాయ ఒకటి
*చింతపండు గుప్పెడు
*కొత్తిమీర
*పసుపు చిటికెడు
*కారం టేబుల్ స్పూన్
*ధనియాల పొడి టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*లవంగాలు 5
*కొబ్బెర తురుము చిన్నకప్పు
*నూనె
*నీరు కావలసినంత
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటి గిన్నెలో వేయాలి. ఈలోగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తరువాత పులుసు తయారు చేయడం కోసం మసాలాను తయారు చేయాలి. మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బెర, లవంగాలు ధనియాల పొడి, కారం పొడి వేసి మసాలా తయారుచేసుకోవాలి.
స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవడం వేయకపోవడం అనేది మన ఇష్టం. నూనె వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని, చిటికెడు పసుపు వేయాలి. చిన్న మంటపై మసాలా బాగా మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మసాలాలోకి మనకు కావలసినంత నీటిని వేసి మూత పెట్టాలి.ఆ మసాలా బాగా ఉడుకుతున్న క్రమంలో చింతపండు పులుసు తయారు చేసుకొని ఆ చింతపండు పులుసును ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి. ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం వచ్చేవరకు మరికొన్ని నీటిని జోడించుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా కాసేపు చింతపండు పులుసు పొడిచిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపముక్కలను వేయాలి. చేపలు వేసిన తర్వాత తగిన మోతాదులోనే ఉప్పును వేసుకోవాలి. చేపముక్కలు వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కూరను తరచూ కలియబెట్టి కూడదు. ఒక ఐదు నిమిషాల పాటు చేపను ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైనట్టే. చేపల పులుసు వేడివేడిగా కంటే చల్లబడిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…