సాధారణంగా కొందరు చేపలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. చేపలలో ముళ్ళు ఉంటాయని భావించి చేపలను పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ చేపలు తినడం వల్ల ఎన్నో పోషకాలను మనం పొందవచ్చు. అయితే చేపలను పులుసుగా తయారు చేసుకొని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చేపలు ఒక కిలో
*వెల్లుల్లి ఒకటి
*ఉల్లిపాయ ఒకటి
*చింతపండు గుప్పెడు
*కొత్తిమీర
*పసుపు చిటికెడు
*కారం టేబుల్ స్పూన్
*ధనియాల పొడి టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*లవంగాలు 5
*కొబ్బెర తురుము చిన్నకప్పు
*నూనె
*నీరు కావలసినంత
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటి గిన్నెలో వేయాలి. ఈలోగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తరువాత పులుసు తయారు చేయడం కోసం మసాలాను తయారు చేయాలి. మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బెర, లవంగాలు ధనియాల పొడి, కారం పొడి వేసి మసాలా తయారుచేసుకోవాలి.
స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవడం వేయకపోవడం అనేది మన ఇష్టం. నూనె వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని, చిటికెడు పసుపు వేయాలి. చిన్న మంటపై మసాలా బాగా మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మసాలాలోకి మనకు కావలసినంత నీటిని వేసి మూత పెట్టాలి.ఆ మసాలా బాగా ఉడుకుతున్న క్రమంలో చింతపండు పులుసు తయారు చేసుకొని ఆ చింతపండు పులుసును ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి. ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం వచ్చేవరకు మరికొన్ని నీటిని జోడించుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా కాసేపు చింతపండు పులుసు పొడిచిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపముక్కలను వేయాలి. చేపలు వేసిన తర్వాత తగిన మోతాదులోనే ఉప్పును వేసుకోవాలి. చేపముక్కలు వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కూరను తరచూ కలియబెట్టి కూడదు. ఒక ఐదు నిమిషాల పాటు చేపను ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైనట్టే. చేపల పులుసు వేడివేడిగా కంటే చల్లబడిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…