Masala Tea Recipe : టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఏ కాలమైనా సరే టీ అనేది చాలా మందికి ఇష్టమైన పానీయం. చలికాలంలో అయితే ఈ టీని అధికంగా తాగుతుంటారు. ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే వచ్చే మజాయే వేరు. అయితే మనం ఇంట్లో తాగే టీకి బయట తాగే టీకి చాలా తేడా ఉంటుంది. బయట బండిపై మసాలా టీ అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కానీ ఇంట్లో మనం మసాలా టీ పెట్టుకుంటే ఆ రుచి రాదు. ఎందుకు.. అంటే.. అందులో సరైన పదార్థాలను సరైన మోతాదులో కలపకపోవడమే అని చెప్పవచ్చు. అయితే కింద చెప్పిన విధంగా సూచనలు పాటిస్తే.. బయట బండ్లపై లభించే విధంగా మసాలా టీని ఎంతో రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బయట బండ్లపై వచ్చేలాంటి రుచి రావాలంటే మసాలా టీ కోసం మనం లవంగాలు, యాలకులు, అల్లం ఉపయోగించాలి. ముగ్గురి కోసం టీ పెడితే ఎంత మోతాదులో ఏమేం కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 2 ఇంచుల అల్లం ముక్కను తీసి దంచి పక్కన పెట్టాలి. అల్లాన్ని నేరుగా వేయకూడదు. టేస్ట్ రాదు. ఎల్లప్పుడూ దంచే వేయాలి. దీంతోపాటు 3 యాలకులను కూడా దంచి పక్కన పెట్టాలి. అలాగే 3 లవంగాలను తీసి పక్కన పెట్టాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 3 చిన్న గ్లాసుల మోతాదులో నీళ్లను పోయాలి. నీళ్లను మీడియం మంటపై బాగా మరిగించాలి. నీరు మరిగాక స్టవ్ను సన్నని మంటపై ఉంచాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో దంచిన అల్లం, యాలకులతోపాటు లవంగాలను కూడా వేయాలి. వీటిని బాగా మరిగించాలి. నీరు కలర్ కాస్త మారాక అందులోనే 3 టీస్పూన్ల టీపొడి వేయాలి. 3 టీస్పూన్ల చక్కెర కూడా వేసి బాగా కలపాలి. తరువాత డికాషన్ రెడీ అవుతుంది. అనంతరం అందులో 3 చిన్న గ్లాసుల మోతాదులో పాలను పోయాలి. తరువాత బాగా కలుపుతూ ఉండాలి. టీ మరిగి పొంగు వస్తుంది. దీంతో టీ రెడీ అయినట్లు భావించాలి. అలా టీ పొంగితేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మసాలా టీని బయట బండ్లపై లభించేట్లు రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసే టీని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…