సమాజంలో ఉన్న తోటి వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. సమాజం అంటే కేవలం మనం జీవించడమే కాదు, పేద వారు జీవించేందుకు కూడా సహాయం చేయాలి. సరిగ్గా ఇలా అనుకుంది కాబట్టే ఆ మహిళ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తోంది. ఆమే.. మహారాష్ట్రకు చెందిన రహెనా షేక్.
రాయ్గడ్ జిల్లా వాజే తాలూకాలో ఉన్న ద్యాని విద్యాలయలో చదువుతున్న 50 మంది పేద పిల్లలను రహెనా దత్తత తీసుకుంది. తనకు తెలిసిన వారి ద్వారా ఆ స్కూల్ గురించి ఆమె సమాచారం అందుకుంది. ఈ క్రమంలోనే ఆ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. తన కుమార్తె బర్త్ డే వేడుకలను జరపకుండా ఆ డబ్బుతో ఆ స్కూల్ పిల్లలకు కావల్సిన సామగ్రిని కొనిచ్చింది. వారిని ఆమె దత్తత తీసుకుని చదివిస్తోంది.
కాగా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపు కూడా లభించింది. ఆమెకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలె సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందించారు. ఆమె 21 ఏళ్లుగా పోలీస్ సర్వీస్లో ఉండగా, ఆమె చక్కని వాలీబాల్ ప్లేయర్ కూడా. ఈ క్రమంలోనే పేద విద్యార్థుల పట్ల ఆమె చూపుతున్న కరుణకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…