సమాజంలో ఉన్న తోటి వారికి మనకు చేతనైనంత సహాయం చేయాలి. సమాజం అంటే కేవలం మనం జీవించడమే కాదు, పేద వారు జీవించేందుకు కూడా సహాయం చేయాలి. సరిగ్గా ఇలా అనుకుంది కాబట్టే ఆ మహిళ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తోంది. ఆమే.. మహారాష్ట్రకు చెందిన రహెనా షేక్.
రాయ్గడ్ జిల్లా వాజే తాలూకాలో ఉన్న ద్యాని విద్యాలయలో చదువుతున్న 50 మంది పేద పిల్లలను రహెనా దత్తత తీసుకుంది. తనకు తెలిసిన వారి ద్వారా ఆ స్కూల్ గురించి ఆమె సమాచారం అందుకుంది. ఈ క్రమంలోనే ఆ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. తన కుమార్తె బర్త్ డే వేడుకలను జరపకుండా ఆ డబ్బుతో ఆ స్కూల్ పిల్లలకు కావల్సిన సామగ్రిని కొనిచ్చింది. వారిని ఆమె దత్తత తీసుకుని చదివిస్తోంది.
కాగా ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపు కూడా లభించింది. ఆమెకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలె సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందించారు. ఆమె 21 ఏళ్లుగా పోలీస్ సర్వీస్లో ఉండగా, ఆమె చక్కని వాలీబాల్ ప్లేయర్ కూడా. ఈ క్రమంలోనే పేద విద్యార్థుల పట్ల ఆమె చూపుతున్న కరుణకు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…