Vishwnath: తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమకి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఆణిముత్యంలా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు.
విశ్వనాథ్ తెరకెక్కించే ప్రతి సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా, సాంప్రదాయ పద్ధతులకు ప్రతీకగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చేసిన విశేష సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈయనను వరించింది. ఇదిలా ఉంటే ఈయన చనిపోయాక ఈయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలోతెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈయన గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విశ్వనాథ్ గారు షూటింగ్ టైంలో ఖాకి దుస్తులు ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది.
ఇదే ప్రశ్నని ఓ ఇంటర్వ్యూలో విశ్వనాధ్ గారిని అడిగితే.. సినిమా అనేది ఒక ఉద్యోగం లాంటిది.దాన్ని మనం చాలా బాధ్యతగా వహించాలి.దానిని ఒక విధిలాగా తీసుకోవాలని,బాధ్యతగా చూపించాలి. అందుకే నేను ప్రతి సినిమా షూటింగ్లో చాలా బాధ్యతగా యూనిఫామ్ వేసుకుని ఉంటాను అంటూ ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. సాధారణంగా సెట్స్ లో పని చేసే లైట్ బాయ్స్, పేయింటర్స్ ఖాకీ రంగు దుస్తులనే వేసుకుంటారు.వారు ఖాకీ షర్ట్ తో పాటు నిక్కర్ వేసుకుంటే, విశ్వనాథ్ మాత్రం ఖాకీ షర్ట్ ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకునే వారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది సినిమా విషయంలో ఆయన డెడికేషన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…