VijayaShanti : విజయశాంతి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోలకి పోటీగా నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది విజయశాంతి. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమాలతో ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.
విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్ అని చెప్పాలి. తన యాక్షన్తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం అని చెప్పాలి.. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసారు. అంతేకాదు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్తో లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్గా తన సత్తా చాటి అందరితో శభాష్ అనిపించుకుంది.
అయితే తాజాగా ఆమె సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల గురించి చెప్పి ఆశ్చర్యపరచింది. ఓ సినిమా కోసం కదులుతున్న రైలు నుండి పక్క కంపార్ట్మెంట్ కు వెళ్లాలని.. ఆ సమయంలో జస్ట్ మిస్ అయితే కింద పడేదాన్ని అని చెప్పింది. అనంతరం ఓ తమిళ సినిమా షూటింగ్ లో తనను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం ఉండగా, అందులో ఆమెను తాళ్ళతో కట్టేసారట. గుడిసెకు నిప్పు పెట్టినప్పుడు గాలి ఎక్కువ వీయడంతో నిప్పు తన చీరకు అంటుకుందని చెప్పింది. అది చూసి హీరో విజయ్ కాంత్ వెంటనే లోపలికి వచ్చి తనను కాపాడారని… అలా చాలాసార్లు చావు చివరి అంచుల వరకు వెళ్లానని విజయశాంతి స్పష్టం చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…