Varun Tej : మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న వరుణ్తేజ్- లావణ్య త్రిపాఠి జంట జూన్ 9న నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక నవంబర్ 1న ఈ జంట ప్రేమ వివాహం జరిగింది. అల్లు శిరీష్ నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఆ ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవలూ వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా, నవంబర్ 5న టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్లో వీరు రిసెప్షన్ జరుపుకున్నారు. వీరి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన ఫొటోలు, వీడియొలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
వరుణ్ తేజ్ పెళ్లై 10 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయన సినిమా షూటింగ్స్లో పాల్గొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. లావణ్యతో హానీమూన్ కి వెళ్లకుండా ఈ యువ హీరో ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ కు గత కొంత కాలంగా సినిమాల్లో కలిసి రావడం లేదు. చివరిసారిగా గాంఢివదారి అర్జున సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వరుణ్ తేజ్ ఈ సినిమాలతో ఎలా అయిన హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే వరుణ్ సినిమా వర్క్ విషయంలో లావణ్య త్రిపాఠి కూడా చాలా ఫేవర్గా ఉందని అర్ధమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో మాత్రం తన అక్క ఉపాసనని ఫాలో అవుతున్నట్టు అర్ధమవుతుంది . రామ్ చరణ్, ఉపాసన దంపతులకి పెళ్లైన పదకొండేళ్లకి పాప జన్మించగా, లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలకి దూరంగా ఉంటుందట. సినిమాలు, వెబ్ సిరీస్లలో నటించాలని ఈ భామ భావించడంతో పాటు ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయిందట. అలాగే ఓ బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి అని సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ ని కూడా రూపొందించాలని లావణ్య అనుకుంటుందట. వీటన్నింటిని ఓ రేంజ్కి తీసుకెళ్లేందుకు పదేళ్లపాటు సమయం పడుతుందని, అప్పటి వరకు తనకు పిల్లలు వద్దని డిసైడ్ అయిందట లావణ్య.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…