Vaazhai OTT Release : ఇటీవలి కాలంలో చాలా మంది దర్శకులు డైరెక్ట్గా ఓటీటీలోకి తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు తప్పని పరిస్థితులలో విడుదల చేస్తుండగా, మరి కొందరు కావాలనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. కలైయరసన్ మరియు నిఖిలా విమల్ నటించిన వాజై తమిళ డ్రామా చిత్రం కాగా, మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . మారి తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్,తో పాటు పెరియారుమ్ పెరుమాల్ సినిమాలు కోలీవుడ్లో బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఆయన ప్రతి చిత్రంలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలను కమర్షియల్ పంథాలో చూపిస్తూ పలు అవార్డ్లు కూడా అందుకున్నారు.
ఆయన తాజాగా వాజై అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతుందని అందరు భావించారు. కాని ఊహించని విధంగా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. వాజై మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వీలైనంత త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు. మూడు బ్లాక్బస్టర్స్ తర్వాత మారి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న వాజై మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాజై సినిమాను నిర్మించిన క్రమంలోనే ఈ మూవీని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేస్తున్నారని సమాచారం.
ఇక వాజై సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తూత్తుకుడిలో జరిగింది. ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్తో ఉంటుందని తెలుస్తుండగా, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి థ్రిల్ అందించే విధంగా ఉంటుందని ప్రేక్షకులు ఈ మూవీని తప్పక ఇష్టపతారని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…