Vaazhai OTT Release : ఇటీవలి కాలంలో చాలా మంది దర్శకులు డైరెక్ట్గా ఓటీటీలోకి తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు తప్పని పరిస్థితులలో విడుదల చేస్తుండగా, మరి కొందరు కావాలనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. కలైయరసన్ మరియు నిఖిలా విమల్ నటించిన వాజై తమిళ డ్రామా చిత్రం కాగా, మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . మారి తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్,తో పాటు పెరియారుమ్ పెరుమాల్ సినిమాలు కోలీవుడ్లో బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఆయన ప్రతి చిత్రంలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్ష, సమస్యలను కమర్షియల్ పంథాలో చూపిస్తూ పలు అవార్డ్లు కూడా అందుకున్నారు.
ఆయన తాజాగా వాజై అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతుందని అందరు భావించారు. కాని ఊహించని విధంగా డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. వాజై మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వీలైనంత త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు. మూడు బ్లాక్బస్టర్స్ తర్వాత మారి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న వాజై మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాజై సినిమాను నిర్మించిన క్రమంలోనే ఈ మూవీని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేస్తున్నారని సమాచారం.
ఇక వాజై సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తూత్తుకుడిలో జరిగింది. ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్తో ఉంటుందని తెలుస్తుండగా, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి థ్రిల్ అందించే విధంగా ఉంటుందని ప్రేక్షకులు ఈ మూవీని తప్పక ఇష్టపతారని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…