Shruti Haasan : టాలీవుడ్లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. యంగ్ హీరో అడివిశేష్ అక్కినేని వారి ఇంటి అమ్మాయి.. కింగ్ నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్ సొదరి సుప్రియని పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా అడివి శేష్, సుప్రియ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు సహజీవనం కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలో విరిపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే ఎప్పడు ఈ విషయంలో స్పందించలేదు ఇద్దరు స్టార్లు. కాకపోతే మీడియా వీరిపై ఎప్పుడూ కన్నేసి ఉంచింది. ఆమధ్య ఇద్దరు ఈ ఏడాది పెళ్లి చేసుకోబొతుననట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కొంత కాలానికి అవి సర్ధుమనిగాయి.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కు స్పెషల్ ఇమేజ్ ఉండగా, అతను మంచి కథా బలం ఉన్న సినిమాలు చేసుకుంటూ క్రేజ్ పెంచుకుంటున్నాడు. శేష్.. సుప్రియతో కలిసి గూడాఛారి సినిమా చేయగా, ఇది పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అడివి శేష్ హీరోగా ఓ చిత్రం ప్రొడ్యూస్ చేయనున్నారు. చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే… పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.
అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక.ఈ సినిమాకు అమెరికాలో జన్మించిన, అక్కడ పెరిగిన షానియల్ డియో దర్శకత్వం వహిస్తారు. అయితే… తెలుగుకు ఆయన కొత్త కాదు. ఆల్రెడీ అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందనేది చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…