Priyanka Chopra : బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్లో తెగ సందడి చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్లో రచ్చ చేస్తుంది.ఈ అమ్మడు తన నటన, ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2018లో నిక్ జోనాస్తో వివాహం చేసుకున్న తర్వాత, ప్రియాంక లాస్ ఏంజిల్స్కు మకాం మార్చింది. ప్రస్తుతం ఈ జంట, వారి కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్తో కలిసి నివసిస్తోంది. అయితే ప్రియాంక బాలీవుడ్ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్ టైగర్ అనే హిందీ సినిమాలో నటించింది.
ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే సెటిలైన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లు కూడా చేస్తుంది. అప్పుడప్పుడు ప్రత్యేక పండుగ సందర్భంలో మాత్రం ప్రియాంక ఇండియాకి వస్తుంది. అయితే ప్రియాంక ఒకప్పుడు ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసింది . అయితే ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేసిందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. గత ఏడాది తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులని విక్రయించిన ఈ గ్లోబల్ భామ ప్రస్తుతం మరో రెండు పెంట్ హౌజ్లు కూడా అమ్మేసినట్టు సమాచారం. దీపావళి వేడుకల కోసం ప్రియాంక ముంబైకి రాగా, ఆ సమయంలో ముంబైలోని అంధేరిలో ఉన్న రెండు పెంట్హౌస్లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించినట్టు ప్రచారం జరుగుతుంది.
ముంబైలోని పోష్ ఏరియా అయిన అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్మెంట్ పెంట్హౌస్లను.. దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబేకి రూ. 6 కోట్లకు విక్రయించింది. రెండు ఫ్లాట్ల మొత్తం విస్తీర్ణం 2,292 చదరపు అడుగులు కాగా,ఈ సేల్ డీల్ అక్టోబర్ నెలలో జరిగింది. లోఖండ్వాలాలోని కరణ్ అపార్ట్మెంట్ టవర్లో, 9వ అంతస్తులో ఉన్న ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్మకాలను ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వాలాదేవీలు జరిగాయి. ఫ్లాట్లను కొన్న చౌబే, మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా రూ. 36 లక్షలు చెల్లించారు. ఓషివారాలోని ఓ పెంట్హౌస్ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్హౌస్ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింది ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగినట్టు సమాచారం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…