Pooja Hegde : అలవైకుంఠపురం చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హేగ్దే.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ భామ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించింది. ప్రస్తుతం పూజాకి తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్సు లేవు. కేవలం పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పూజా బాలీవుడ్లో దేవా అనే సినిమాకు సైన్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాలో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ను కూడా ఫిక్స్ చేశారు.
తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. పూజా హెగ్డేని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ కి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్టు భయాని చెప్పుకొచ్చాడు. ఈవెంట్ మేనేజర్తో పూజా హెగ్డే గొడవ పడగా, ఆ సమయంలో టైంలో పూజా హెగ్డేని చంపేస్తామని కొందరు బెదిరించారట. ఈ క్రమంలో భయపడిపోయిన పూజా హెగ్డే ఇండియాకి వచ్చేసిందని అంటున్నారు.
అయితే ఈ వార్త కేవలం రూమరేనని కొందరు అంటున్నారు. ఈ విషయంపై బీటౌన్ మీడియా నటి పూజటీమ్ని సంప్రదించగా, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని వారు చెప్పినట్లు బీటౌన్ వర్గాలు తెలియజేశాయి. అయితే, సోషల్మీడియాలో వైరల్ అయిన ఆ పోస్ట్ను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ న్యూస్ కేవలం రూమరే అని తేలిపోయింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు కాస్త ఊరట లభించింది. పూజా హెగ్డేకి ఇటీవల ప్లాప్ లు పెరగడంతో.. అవకాశాలుతగ్గుతూ వస్తున్నాయి. ఐరన్ లె్ గ అన్న పేరు పడటంతో.. పూజాహెగ్డే సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తోంది. ఈక్రమంలో మహేష్ బాబుతో చేయబోయిన గుంటూరు కారం మూవీ నుంచి వెనక్క రావల్సి వచ్చింది. లైగర్ ఫెయిల్యూర్ తో.. విజయ్ దేవరకొండతో చేయాల్సి జనగనమణ సినిమా ఆగిపోయింది. ఆ రకంగా కూడా కలిసిరాలేదు బుట్టబొమ్మకి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…