Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) జెమిని టీవీ (Gemini TV)లో చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeshwarulu) షోకు మంచి ఆదరణే లభిస్తోంది. సెలబ్రిటీలు గెస్ట్లుగా వచ్చినప్పుడు మాత్రం రేటింగ్స్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. ఇక తాజా ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మహేష్ పాల్గొన్న ఈ ఎపిసోడ్కు ఫ్యాన్స్ నుంచి విశేషమైన రీతిలో స్పందన లభించింది. నిర్వాహకులు అనుకున్నదానికన్నా ఎక్కువ వినోదాన్ని అందించారు. దీంతో ఇద్దరు స్టార్స్కు చెందిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక ఈ ఎపిసోడ్లో భాగంగా మహేష్ను ఎన్టీఆర్ పలు తికమక పెట్టే ప్రశ్నలు అడిగారు. దీంతో మరింత వినోదం లభించింది. అయినప్పటికీ మహేష్ తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. అయితే ఈ షోలో మహేష్ని రెండు ప్రశ్నలు బాగానే ఇబ్బంది పెట్టాయని చెప్పవచ్చు. దీంతో ఆయనహెల్ప్లైన్ వాడుకున్నారు.
మొదట 10 ప్రశ్నల వరకు మహేష్ ఎలాంటి హెల్ప్లైన్ వాడుకోకుండానే సమాధానాలు చెప్పారు. దీంతో 3 హెల్ప్లైన్స్ అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలోనే 11వ ప్రశ్న కింద మహేష్కు ఎన్టీఆర్ చరిత్రకు సంబంధించిన ప్రశ్న వేశారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ రాజవంశానికి చెందినవారని అడిగారు. ఈ ప్రశ్నకు మహేష్ తడబడ్డారు. దీంతో హెల్ప్ లైన్ తీసుకున్నారు. మహేష్ ఫేవరేట్ దర్శకులలో ఒకరైన కొరటాల శివకు వీడియో కాల్ చేశారు. కొరటాల శివ సంగమ రాజవంశం అని రైట్ ఆన్సర్ చెప్పారు.
ఇక 12వ ప్రశ్నగా ఫుట్ బాల్కు చెందిన అంశం గురించి అడిగారు. అయితే దీనికి మహేష్ ఈజీగా జవాబు చెప్పారు. ఇక 13వ ప్రశ్నకు మహేష్ మళ్లీ టెన్షన్ పడ్డారు. ఈ ప్రశ్నకు కూడా ఆయన హెల్ప్ లైన్ వాడుకున్నారు. జంతువు బొమ్మ లేని లోగో ఉన్న కార్ బ్రాండ్ పేరు చెప్పాలని మహేష్ ని ఎన్టీఆర్ అడగ్గా.. హెల్ప్ లైన్ ద్వారా నాలుగు ఆప్షన్స్ లో రెండు రాంగ్ ఆన్సర్స్ ను తొలగించారు. ఫెర్రారీ, లాంబోర్గిని రెండు ఆప్షన్స్ లో.. లాంబోర్గిని అని మహేష్ సరైన సమాధానం చెప్పారు.
కాగా ఆదివారం ఎపిసోడ్ అయిపోయే వరకు మహేష్ మొత్తం 13 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నారు. తరువాతి ఎపిసోడ్ళో ఆయన రూ.50 లక్షలు, రూ.1 కోటి కి చెందిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు. అయితే మహేష్ షోలో రూ.25 లక్షలు మాత్రమే గెలుచుకున్నారని ఇప్పటికే వార్త లీకైంది. దీంతో ఆయన తరువాతి రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవచ్చని తెలుస్తోంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…