Dunki Day 1 Collection : ఇటీవలి కాలంలో షారూఖ్ ఖాన్ వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు.పఠాన్, జవాన్ చిత్రాలతో మంచి విజయాలు సాధించిన షారూఖ్.. డంకీ మూవీతో హ్యాట్రిక్ కొడతానని అందరు అనుకున్నరు. కాని ఆ రేంజ్లో సక్సెస్ సాధించలేదు. డంకీ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజూ, 3 ఇడియెట్స్ లాంటి చిత్రాలను అందించిన రాజ్కుమార్ సినిమా కావడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే జరిగింది. కానీ షారుక్ సినిమాలు పఠాన్, జవాన్ స్థాయిలో జరగలేదని చెప్పాలి.డంకీ చిత్రాన్ని సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే అంటే దాదాపు 150 కోట్ల మేర జరిగింది.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టలేదు. కేవలం 30 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ ఏడాది రిలీజైన షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్ , జవాన్ చిత్రాలకి మంచి వసూళ్లు రాగా, డంకీ మాత్రం తొలి రోజు బాగా నిరాశపరచింది. షారుఖ్ఖాన్ జవాన్ మూవీ తొలిరోజు 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, పఠాన్ 57 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. డంకీ చిత్రానికి సంబంధించి నేషనల్ మల్టీప్లెక్స్లో టికెట్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. ఈ సినిమా టికెట్లు ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్, సినీ పోలీస్ లాంటి స్క్రీన్లలో 300000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 18 కోట్ల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది.
డంకీ మూవీ తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినాకు తగినట్టుగా కాసులు వర్షం కురిపించలేకపోయింది. పఠాన్, జవాన్ సగం వసూళ్లు కూడా ఈ మూవీ రాబట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.అడ్డ దారుల్లో విదేశాలకు వలస వెళుతోన్న వారి జీవితాలను వినోదం, ఎమోషన్స్ కలగలిపి ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీ. అయితే ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…