Vastu Tips : చాలామంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎక్కువమంది, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి సతమతమవుతుంటారు. పేదరికం పోయి, ఐశ్వర్యం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. మీ ఇంట్లో నుండి, వీటిని కనుక తొలగించారంటే, పేదరికం పోతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. పేదరికం ని తొలగించుకోవాలి అంటే, ఇలా చేయడం మంచిది. ఇంట్లో పావురం గూడు ఉంటే, దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి, ఇంట్లో డబ్బులు పోతాయి. పావురం గూడు ఉంటే తీసేయడం మంచిది. అలానే, అప్పుడప్పుడు మన ఇంట్లో తేనె పట్టు కూడా ఉంటుంది.
తేనె పట్టు కూడా ఉండకూడదు. తేనెటీగ చాలా ప్రమాదకరం. పైగా, ఇది ఉండడం వలన అదృష్టం తొలగిపోతుంది. దురదృష్టం కలుగుతుంది. పైగా ఇది ప్రమాదం కూడా. ఇది కూడా ఉంటే, వెంటనే ఇంట్లో నుండి తొలగించడం మంచిది. సాలెగూడు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో సాలె పురుగు గూడు, జీవితంలో దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి, తీసేయండి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు ఉండకూడదు. చిన్నదే పగిలిపోయింది కదా అని చాలామంది వాడుతూ ఉంటారు. అలాంటి తప్పులు చేయకండి.
పగిలిపోయిన అద్దం ఉంటే, వెంటనే తొలగించడం మంచిది. ఇంట్లో గబ్బిలాలు కూడా తిరుగుతూ ఉండకూడదు. ఇవి మీ జయాన్ని ఆపేస్తూ ఉంటాయి. మీకు ఇబ్బందుల్ని తీసుకువస్తాయి. ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. దానితోపాటుగా ఇంట్లో గోడలకి పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో గోడలకి పగుళ్లు ఉంటే, సంపదకి ఆటంకం కలుగుతుంది. ప్రతికూల శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి, ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి.
ఇంటి కుళాయి ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా పాడైపోయిన కుళాయి ఉంటే అది ఇంటికి అశుభాన్ని తీసుకువస్తుంది. ఇబ్బందుల్ని కలిగిస్తుంది. చాలామంది, మేడ మీద పనికిరాని వస్తువుల్ని పెడుతుంటారు. అది కూడా తప్పు. అటువంటివి చేయకండి. ఎండిపోయిన పువ్వులు, ఎండిపోయిన ఆకులు కూడా ఇంట్లో ఉండకూడదు. వీటిని వెంటనే తొలగించాలి. ఇలా, మీరు కనుక ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…