Anee Master: బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రియాల్టీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షో వల్ల చాలా మంది కంటెస్టెంట్స్ పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంట షో చూపించడం వలన వారిపై నెగెటివిటీ రావడంతో తప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే కాకుండా కొన్నిసార్లు వారి కుటుంబసభ్యుల గురించి కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోలింగ్ను మాత్రం కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరికొందరు అస్సలు పట్టించుకోవడం లేదు.
అనూహ్యంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన రవితోపాటు ఆయన భార్య, కూతురు మీద ట్రోల్ చేసే సరికి వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి. తనపై.. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు రవి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకుని మరీ ఆధారాలు.. స్క్రీన్ షాట్స్ దగ్గరుండి చూపించినట్టుగా కనిపిస్తోంది. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడు.
ఇక తాజాగా రవి తీసుకున్న నిర్ణయాన్ని బిగ్బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ అభినందించింది. అంతేకాదు నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసింది చాలు అంటూ ఫైర్ అయింది. బిగ్బాస్ హౌస్లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్ ఇచ్చింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…